ఆళ్లగడ్డ: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించారు.