పోలవరానికి బయలుదేరిన సీఎం వైయస్ జగన్
6 Jun, 2023 09:48 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించనున్నారు. కాసేపటి క్రితం తాడేపల్లి నుంచి పోలవరానికి సీఎం వైయస్ జగన్ బయలుదేరారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.