నాసిక్ ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి
22 Apr, 2021 11:34 IST
తాడేపల్లి: మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీ వల్ల.. సమయానికి ప్రాణవాయువు అందక రోగులు మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.