అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన సభలో మొదట ప్రశ్నోత్తరాల సమయం, ఆ తరువాత జీవో అవర్ నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. కొద్దిసేపటి క్రితం 2017–2018 కాగ్ రిపోర్టును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.