రేపు మూడో విడ‌త నేత‌న్న‌ నేస్తం

9 Aug, 2021 18:09 IST

 తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) మూడవ విడత వైయ‌స్సార్‌ నేతన్న నేస్తంను  అమలు చేయనున్నారు. బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమచేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ. 24 వేలు చొప్పున నగదు జమకానుంది. కరోనా కష్టకాలంలోనూ వైయ‌స్సార్‌ సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తోంది.