నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైయస్ జగన్
19 Jan, 2021 10:55 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.