జ‌గ‌న‌న్నా న్యాయం జ‌రిపించండి..!

21 Aug, 2018 17:56 IST
విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గానికి  చెందిన అక్కాచెల్లెళ్లు ర‌మ‌,లత  ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ క‌ష్టాన్ని చెప్పుకున్నారు. త‌మ తండ్రి స‌త్య‌నారాయ‌ణ‌ను టీడీపీకి చెందిన వ్య‌క్తులు హ‌త్య‌చేశార‌ని, అధికారం అడ్డంపెట్టుకుని నిందితులు త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ని, టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడి మేర‌కే పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేయ‌డంలేద‌ని ఆరోపించారు. త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు.