మా గ్రామంలో 600 కి.మీ దాటడం మాకు గర్వంగా ఉంది

24 Dec, 2017 15:09 IST

మా గ్రామంలో ప్రజా సంకల్పయాత్ర 600ల కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం మాకు చాలా గర్వంగా ఉందంటూ కదిరి నియోజకవర్గ కటారుపల్లి గ్రామస్థులు అంటున్నారు.  మా ఊరిలో జగనన్న వేప చెట్టు కూడా నాటారు దానిని కంటి రెప్పలా కాపాడుతాం.  మా గ్రామంలోని సమస్యలన్నీ వైయస్‌ జగనన్నకు చెప్పుకున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నాం. ప్రజా రంజక పాలన చేసి మాకు తోడుగా ఉంటాడని ఆకాంక్షిస్తున్నట్లు వారు చెప్పారు.