చదువుకు దూరం కావాల్సి వస్తోందన్నా..
1 Dec, 2017 11:05 IST
కర్నూలు: ‘అన్నా.. మా ఊర్లో వర్షాకాలమే పనులుంటాయ్.. డిసెంబర్ వచ్చిందంటే బతుకుదెరువు కోసం మా తల్లిదండ్రులు కడప, హైదరాబాద్, బెంగళూరు, గుంటూరుకు వలస వెళ్తారు. మమ్మల్ని కూడా బడి మాన్పించి వారి వెంటే తీసుకెళుతుండటంతో చదువుకు దూరం కావాల్సి వస్తోంది’.. అంటూ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఉమా, జరీనా, గీతాంజలి, రాజేశ్వరి, భావన తదితరులు వైయస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.