కాలేజిలో కనీస సదుపాయాలు లేవన్నా..
13 Nov, 2018 15:16 IST
వైయస్ జగన్కు కళాశాల విద్యార్థునుల మొర...
విజయనగరంః వైయస్ జగన్ను కలిసిన మక్కువ జూనియర్ కాలేజి విద్యార్థినులు తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ కాలేజిలో కనీస సదుపాయాలు లేవని, కూర్చోవడానికి బెంచీలు లేక నేల పైనే కూర్చుంటున్నామని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజికి ప్రహరీ గోడ లేక ఆకతాయిలకు అడ్డగా మారిందని వైయస్జగన్కు ఫిర్యాదు చేశారు.వైయస్ జగన్ విద్యార్థులను ఆశీర్వదించి సమస్యలు పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు.