బెల్టు షాపులు తొలగించాలి: మహిళలు
14 Nov, 2017 10:14 IST
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వివిధ వర్గాల ప్రజలు కలుస్తున్నారు. మూడిళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళలు వైయస్ జగన్ను కలిసి మా భర్తలు మద్యం తగి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఓ మహిళ జననేతకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని బెల్టుషాపులు, వైన్ షాపులు తొలగించాలని ఆమె కోరారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మన ప్రభుత్వం రాగానే ఇలాంటి షాపులు మూసి వేస్తామని హామీ ఇచ్చారు.