ఆన్లైన్తో ఉపాధి లేకుండాపోయిందన్నా..
8 Jan, 2018 11:02 IST
చిత్తూరు: ఆన్లైన్తో ఉపాధి లేకుండాపోయిందని ఫొటోగ్రాఫర్ల సంఘం నాయకులు వైయస్ జగన్కు వినతిపత్రం అందించారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ తాము ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శివశంకర్, మోహన్రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనేక సంక్షేమ పథకాలతో తమకు చేతినిండా పని ఉండేదని, ఇప్పుడు ఆన్లైన్తో ఉపాధి లేకుండాపోయిందని, ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.