ధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు
11 Jun, 2018 11:50 IST
పశ్చిమగోదావరి : సివిల్ సప్లయి గోదాముల్లో తమ భర్తలు పని చేస్తున్నప్పటికీ జీతం ఇవ్వడంలేదని దారవరం గ్రామానికి చెందిన గంటి రత్నకుమారి, గుమ్మాపు వాణి అనే మహిళలు అదే గ్రామంలో జగన్మోహన్రెడ్డిని కలసి తమ బాధ చెప్పుకున్నారు. జీతాలు చెల్లించాలని సంబంధిత అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు
క్యాన్సర్తో బాధపడుతున్నా..
క్యానర్తో బాధపడుతున్నానని వైద్యానికి సహకరించాలని దారవరానికి చెందిన గన్ని మరియమ్మ అనే మహిళ వైయస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకుని తన బాధ చెప్పుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని వైద్యానికి మీరే సహకరించాలని, పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదని, మీరు అధికారంలోకి రాగానే పింఛను ఇప్పించాలని కోరారు.