మరుగుదొడ్డి బిల్లు ఇవ్వడం లేదు
11 Jan, 2018 12:34 IST
చిత్తూరు :‘ అన్నా... పోయిన ఏడాది ఉపాధి హామీ కింద చెట్లు నాటుకున్నా. ఇంటికి లెట్రిన్ లేకపోవడంతో స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డి కట్టుకున్నా. బిల్లు కోసం మండలాఫీసుకు పోతే నువ్వు ఏ పార్టీ అని అడగతా ఉండారు’ అంటూ నల్లవెంగనపల్లెకు చెందిన రైతు బి పార్థసారథినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చినబొట్లవారిపల్లె వద్ద వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల కోసం బిల్లులు అడుగుతుంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే అధికారులు నగదు చెల్లింపులు చేస్తున్నారన్నారు. రూ.21,810 తనకు బిల్లుల రూపంలో రావాల్సి ఉందన్నారు.