బాబు పాలనలో తాగునీరే దొరకడం లేదు

12 May, 2018 14:28 IST

కృష్ణా: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత తాగునీరే సరిగ్గా దొరకడం లేదని కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్న ప్రజలు వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని నాలుగేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు వివరించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో సాగు, తాగునీరు పుష్కలంగా ఉండేవన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంటలు లేక అల్లాడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైయస్‌ఆర్‌ పాలన రావాలంటే వైయస్‌ జగన్‌ అధికారంలోకి రావాలన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలన్నీ తీరుతాయన్నారు.