ప్రతిపక్ష నేతను కలిసిన మామిడి తాండ్ర తయారీదారులు

29 Sep, 2018 12:39 IST
విజయనగరంః ఆలమందలో వైయస్‌ జగన్‌ను మామిడి తాండ్ర తయారీదారులు కలిశారు తమ బాధలు చెప్పుకున్నారు. దివంగత మహానేత  వైయస్‌ఆర్‌ హయాంలో పంచదారను సబ్సిడీ ధరలకు ఇచ్చారని, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరలేక ఇబ్బందిపడుతున్నామన్నారు. కోల్ట్‌ స్టోరేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైయస్‌ జగన్‌ మామిడి తాండ్ర  తయారీదారుల సమస్యలను తెలుసుకున్న వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.