బాబు హామీ ఇచ్చి మరిచారు
30 May, 2018 10:14 IST
పశ్చిమ గోదావరి: ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మన రాష్ట్రంలో సుమారు 25 వేల మంది ఉన్నాం. చంద్రబాబు హామీ ఇచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం మరిచారు అంటూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.సంధ్య, పి.సుధాకర్, మోహన్, సుకుమార్, శ్రీనివాస్, సావిత్రి తదితరులు పాదయాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డి కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమరు సీఎం అయ్యాక ఉద్యోగ భద్రత కల్పించండన్నా అంటూ విజ్ఞప్తి చేశారు.