ఈడిగలను ఆదుకోండి
13 Dec, 2017 13:16 IST
అనంతపురం: అభివృద్ధిలో వెనుకబడిన ఈడిగలను ఆదుకోవాలని ఆ సంఘం నాయకులు వైయస్ జగన్ను కోరారు. టీడీపీ ప్రభుత్వం ఈడిగలకు తీరని అన్యాయం చేస్తోందని ఈడిగ(గౌడ) సంక్షేమ సంఘం ప్రతినిధులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. ఈడిగ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమణగౌడ్, నగర అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ తదితరులు కలసి వినతిపత్రం అందజేశారు.