భూములు లాక్కునేందుకు కుట్ర

18 Apr, 2018 14:12 IST

కృష్ణా జిల్లా: టీడీపీ నేతలు భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని సీఆర్‌ నగర్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు . ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను సీఆర్‌నగర్‌ వాసులు కలిశారు. ల్యాండ్‌ సర్వేల పేరుతో అధికారులు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కాలనీవాసులు వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.