అన్నా.. నేను ఆటో డ్రైవర్ని, నాకు ఇద్దరు కుమార్తెలు.. ఎనిమిదేళ్ల నా పెద్ద కుమార్తె హుమేరాకు పుట్టుకతో కంటిచూపు లేదు. మాటలు వినబడకపోవడంతో పాటు మతిస్థిమితం కూడా సరిగా లేదు. సదరం క్యాంపునకు వెళ్తే 40 శాతమే వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఆ సర్టిఫికేట్ను అధికారులకు చూపి వికలాంగ పింఛన్ అడిగితే రాదు పొమ్మంటున్నారు.. అంటూ అనంతపురం రూరల్ మండలం వైయస్ఆర్ కాలనీకి చెందిన పర్వీన్, ఇస్మాయిల్ దంపతులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డకు పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకున్నారు.