నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం ఎన్నికల ప్రచారం
4 May, 2024 10:17 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం హిందూపురం పార్లమెంట్ పరుధిలోని హిందూపురం పట్టణంలో అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్స్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు.