ఈ మృగానిది మాయదారి రోగం

2 Mar, 2022 14:47 IST

తప్పుడు వార్తలతోనే కాదు..తెలివితక్కువ తనం బుర్రతక్కువతనాన్ని ప్రదర్శించుకోడంలోనూ ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ముందుంటుంది.
మిలాన్ -2022లో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర జంతువును మృగం అన్నారని..అదివిని అందరూ నవ్వేసారని ఓ పిల్లిపిత్తిరి వార్త ఒకటి రాసి పారేసింది అంధజ్యోతి..పైగా జగన్ కు సబ్జెక్ట్ పై అవగాహన లేందంటూ తన వెకిలితనాన్ని ప్రదర్శించింది. 
మృగం అనేదానికి జంతువు అని, జింక అనే అర్థం కూడా ఉంటుందని తెలీని తెగులు బ్యాచ్ అంతా ఆ పేపర్లోనే ఉన్నట్టుంది మరి. 
జగన్ మీద రాయడానికి వేయడానికి గులకరాళ్ల నుంచి బండరాళ్ల దాకా ఏరుకునే పనిలో తలమునకలుగా ఉండటమే కాదు..కాస్త తెలుగు పదాలకు అర్థాలు తెలుసుకుని తెలుగు పత్రిక నడపాలన్న ఇంగిత జ్ఞానం ఆ అడ్డగోలుజ్యోతికి కలగనే కలగదు.
పచ్చపార్టీకి ఊడిగం చేసే ఈ పేపర్ మృగానికి కోడిగుడ్డుమీద ఈకలు పీకే మాయదారి రోగం పోనూ పోదు.