కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల
01 Dec 2021 10:29 AM
హైదరాబాద్: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. ఈ ఉదయం ఫిలిం చాంబర్ వద్ద సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ఏపీ ప్రజల తరఫున సీతారామశాస్త్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.