సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వైవీ సుబ్బారెడ్డి కృత‌జ్ఞ‌త‌లు

కాలినడకన తిరుమల చేరుకున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన ముఖ్య‌మంత్రి  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి  కృతజ్ఞతలను తెలియజేశారు.  తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి కాలినడకన తిరుమలకు శనివారం ఉదయం చేరుకున్నారు.దైవ ద‌ర్శ‌నం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను కాపాడుతూ.. భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతన ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్షలు చేపడతామన్నారు. బంగారం వివాదాన్ని నిగ్గుతేల్చుతామని స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుల తొలగింపు నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని వెల్లడించారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Back to Top