గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘన విజయం

పదికి పది స్థానాలు కైవసం

విశాఖపట్టణం: గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఓటింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం ముగిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వైయ‌స్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు 10 మంది విజయం సాధించారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును 67 మంది కార్పొరేటర్లు వినియోగించుకున్నారు. వారిలో 57 మంది వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు మంది ఉండగా, స్వతంత్రులు 4, ముగ్గురు టీడీపీ, బీజేపీ 1, జనసేన 1, సీపీఐ 1 కార్పొరేటర్లు ఉన్నారు.

ఉనికి కోస‌మే టీడీపీ పోటీ:

ఈ ఎన్నికల్లో విజయంపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైయ‌స్సార్‌ కాంగ్రెస​ పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. వైయ‌స్సార్‌సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా టీడీపీ ఉనికి కాపాడుకోవడానికి పోటీ చేసిందని తెలిపారు. ప్రజలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నాయకత్వం విశ్వసిస్తున్నారని ఈ ఫలితాలతో రుజువైంద‌ని చెప్పారు.  పరిపాలన రాజధానికి గ్రేటర్ విశాఖ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. తమకు ఏ పార్టీలు పోటీనే కాదు అని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన విశాఖ అభివృద్ధి అడ్డుకోలేరని తెలిపారు. విశాఖలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. గ్రేటర్ విశాఖలో మా గెలుపు చూపించామని తెలిపారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తాము ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top