ఢిల్లీలో స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల ధర్నాకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు

‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌’ ఫ్లకార్డులతో నిరసన తెలిపిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు

ఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ధ్యేయంగా విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచింది. స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక నేతల ధర్నాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎంపీపీ సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్, మాధవ్‌ తదితరులు పాల్గొని ‘సేఫ్‌ విశాఖ స్టీల్‌’  ఫ్లకార్డులతో నిర‌స‌న తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినదించారు.   

Back to Top