అమరావతి: వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడు ముసుగు తొలగిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని అన్నారు. తాజాగా వివేకా కేసుపై సునీత చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం సచివాలయం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఏమన్నారంటే: అవి చంద్రబాబు పలికించిన చిలుకపలుకులే: – సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరి ప్రతినిధిగా ఇన్నాళ్లూ తప్పుడు కేసు బిల్డ్ చేస్తున్నారో అంతా ఈ రోజు బయటపడింది. – ఆమె మాట్లాడిన దానికంటే.. ఇందుకు వేరే ఆధారాలు అవసరం లేదు. – ఆమె మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికించిన చిలుకపలుకులు అనేది ఇంతకంటే పెద్ద ఆధారం ఏమీ ఉండదు. – ఆమె తన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి మేమే కారణమని ఆరోపిస్తున్నారు. – ఆనాడు 2017లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు 160 పైగా ఓట్లు అధికంగా వైఎస్సార్సీపీకి ఉన్నాయి. – స్థానిక సంస్థల కోటా కింద వివేకానందరెడ్డి గారు థంపింగ్ మెజార్టీతో గెలవడానికి కావాల్సినన్ని ఓట్లు పార్టీకి ఉన్నాయి. – అందుకోసమే తన చిన్నాన్నను జగన్ గారు అభ్యర్థిగా పెట్టారు. – చంద్రబాబులా ఓడిపోయే సీటుకు పోటీ పెట్టలేదు. – మేము గెలిచే సీటుకు ఆయన తన చిన్నాన్న గారిని పెట్టారు. – వైఎస్సార్ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లి జగన్ గారిని రాజకీయంగా అంతుచూడాలని..విజయమ్మ గారి మీద వారే పోటీకి దిగారు. – అయినా వివేకాను దగ్గరకు తీసుకున్నది వైఎస్ జగన్ గారు. వివేకా కూడా అలానే వచ్చి పార్టీలో కలిసిపోయారు. గతంలో జరిగినవి పొరపాటు అని చెప్పారు. – ఆయన అడక్కుండానే వివేకాను జగన్ గారు అభ్యర్థిగా పెట్టారు. – వాస్తవంగా వివేకా సునాయసంగా గెలిచిఉండాలి. – అలాంటి వ్యక్తిపై ఆనాడు పోటీకి దిగింది ఎవరు..? ఈ రోజు ఆమె ఎవరికైతే థ్యాంక్స్ చెప్తోందో అదే బీటెక్ రవి. – అతను గెలిచి, తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్ని ఉండాలి..? – బీటెక్ రవి గానీ, మా దగ్గర నుంచి ఫిరాయించి మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి గానీ కుట్ర పన్ని ఉండాలి. – వివేకాపై ఏదన్నా చేయాలంటే వాళ్లకు ఎక్కువ అవకాశం ఉంది. – వివేకాకు ఎవరిమీదైనా కోపం ఉందంటే వాళ్లమీదనే ఉండి ఉండాలి. – అందుకే ఆయన 2019 ఎన్నికల్లో అవినాష్రెడ్డి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. – మా పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయన బాధ్యత తీసుకుని ప్రచారం చేస్తున్నారు. రాజకీయ కుట్రతోనే ఢిల్లీలో ప్రెస్ మీట్: – అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్యకు కారణం అవడానికి అవకాశం ఉందో వాళ్లని కాదని, ఇంట్లో వాళ్లే చేశారని ఏడాది తర్వాత ప్లేట్ ఫిరాయించి వాళ్లతోనే జట్టుకట్టి ఇన్నాళ్లు యుద్ధం చేస్తూ వాళ్లకే నేడు థ్యాంక్స్ చెప్తోంది. – మార్చి 15న హత్య జరిగింది. మే 30 వరకూ టీడీపీ ప్రభుత్వమే ఉంది. – సునీత చెప్పినట్లే హత్య కేసు సాధారణంగా వారం రోజుల్లో తేలిపోతుంది అన్నప్పుడు ఈమె మిత్రుడైన చంద్రబాబు ఎందుకు తేల్చలేదు? – ఆ లోగా విచారణ పూర్తి చేసి చంద్రబాబు ఎందుకు కేసు పూర్తి చేయలేదు? – ఆమె తలాతోక లేకుండా మాట్లాడుతుంది అనుకోవాడానికి వీళ్లేదు. పూర్తిగా ఒక రాజకీయ కుట్రతో ఢిల్లీ వెళ్లి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనే స్పష్టమవుతోంది. – ఎన్నికలు దగ్గరవుతున్నందున చంద్రబాబు ఉసిగొల్పి వేరొకరితో మాట్లాడించి తన అస్త్రాలను వాడుతున్నాడనటానికి ఇదొక ఉదాహరణ. కిరాతకంగా హత్య చేసినవాడు మీకు మంచోడయ్యాడా..!: – ఆమె రాజకీయాల్లోకి వస్తే మంచిదే కదా? ఎన్నికలు 50 రోజులు ఉండగా పోలిటికల్ సైడ్ తీసుకుని ఆమె బయటకు వచ్చింది కదా.. – ఆమె కూడా ప్రజాకోర్టులో తేలాలి అంటుంది కదా..అదే తేలుతుంది. – ఏ చట్టం మాకు అప్లై కాకూడదు అనే బాపతు, దాన్ని ఆధారంగా తీసుకుని ప్రజలు జగన్ గారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని వారంతా కోరుకుంటున్నారు. – కేసులకు ప్రజలకు సంబంధం ఏముంది? జగన్ గారు ప్రజలకు ఏం చేస్తామని చెప్పారో దాని ప్రకారం ప్రజల్లోకి వెళ్తున్నారు, – చంద్రబాబు కూడా అలానే వెళ్లాలి. లేదా వివేకా కుమార్తె సునీత వెళ్లినా అలానే వెళ్లాలి. – నాకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి, దానికోసం మీరు జగన్కు శిక్షించండి అని కోరడం విచిత్రం. – ప్రజలన్నా, వారి నిర్ణయం అన్నా వీరికి ఎంత అలుసుగా ఉందో అర్ధం కావడం లేదు. – హత్య జరిగిన విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. ఆమె కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమోననే అనుమానం కూడా చాలా మందికి ఉంది. – సీబీఐకి ఇచ్చిన కొన్ని వాంగ్మూలాలు లోతుగా చూస్తే అది కనిపిస్తోంది. – దాన్ని తప్పించుకోడానికి దొంగే దొంగ దొంగ అన్నట్లు తిప్పికొడుతున్నారేమో అనే అనుమానం కూడా వస్తుంది. – విచారణ జరిగితే వాటిమీద కూడా జరగాలి. – ఒక హంతకుడిని అప్రూవర్గా చేసుకుని, ఎవరైతే తన తండ్రిని ఎలా కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడో కూడా చెప్పినోడునే అక్కున చేర్చుకుని వాడిని సోదరుడు కింద చూస్తున్న వీళ్లను ఏమనాలి? 24 సీట్లు తీసుకుని 240 సీట్లన్నట్లు మాట్లాడితే ఎలా?: – మా దగ్గర నుంచి బయటకు వెళ్లిన వాళ్లను చంద్రబాబు తీసుకుంటున్నాడు. జనసేనలోకి తీసుకుంటున్నాడు. – మరి వాళ్లంతా స్మగ్లర్లు, గూండాలు కాకుండా పోయారా? – తిట్లు, బూతులు తప్ప ఏమీ మాట్లాడని వారి గురించి నేను మాట్లాడటం అనవసరం. – ముసుగులన్నీ తొలిగితే మంచిదే కదా? బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెళ్లి కలిశాడు...పవన్ కల్యాణ్ స్టేజ్ మీద కూడా చెప్పాడు కదా? – బీజేపీ వాళ్లు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు కానీ చంద్రబాబు మాత్రం బీజేపీతో కలిసిపోయినట్లే ఫీల్ అవుతున్నాడు. – వాళ్ల అండ కూడా తీసుకుని, ఏదో ఒక రకంగా అర్జంటుగా కుర్చీ ఎక్కాలని తాపత్రయపడుతున్నారని ప్రజలందరికీ స్పష్టం అయిపోయింది. – బాషా ఒక్క సారి చెప్తే వందసార్లు చెప్పినట్లే అన్నట్లు..పవన్ కల్యాణ్ 24 సీట్లు తీసుకుని 240 సీట్లు అనుకుంటే ఎలా? – ఆయనేమో మాకు శక్తి లేదు..బూత్ స్థాయిలో భోజనాలకు డబ్బులు లేవు అంటున్న వ్యక్తి. – జనసేనకు 30వేల ఓట్లకు పైగా వచ్చిన 15 నియోజకవర్గాల్లో ఏడింటిని టీడీపీకి ఇచ్చాడు. – మిగిలినవాటిలో ఎక్కడైతే ఓడిపోతాడో అవన్నీ చంద్రబాబు..పవన్ కల్యాణ్కు ఇచ్చాడు. – ఆ చీటి చూస్తే అర్ధం అవుతుంది కదా? చంద్రబాబు రంగుల ఫోటో పెట్టుకున్నాడు. – పవన్కు మాత్రం మెడికల్ షాపు ప్రిస్కిప్షన్ రాసిచ్చినట్లు ఓ ఐదు సీట్లు రాసిచ్చాడు. చంద్రబాబు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ జనసేనః – చంద్రబాబుకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టుకుని వచ్చి నేను వామనవతారం, పాతాళానికి తొక్కుతా అంటే ప్రజలు నవ్వుతారని కూడా గ్రహించకపోతే ఎలా? – 2014లో పవన్ పార్టీ పెట్టాడు. పదేళ్లయింది. సమకాలీన చరిత్రలో పోలిక చూసుకోవాలి. – జగన్ గారు 2011లో పార్టీ పెట్టారు. 2014కు ముందే స్థానిక సంస్థలన్నిటిలో పోటీకి దిగారు. – 2014లో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టి జగన్ గారు పోటీకి దిగారు. – ముందుగా పవన్ 175 నియోజకవర్గాలకు ఇంఛార్జులను పెట్టి సీరియస్ నెస్ చూపించాలి కదా? – చంద్రబాబు రాసిచ్చిన స్టేట్మెంట్ చదవడం, రెండు నెలలకో, మూడు నెలలకో బయటకు రావడం తప్ప సీరియస్నెస్ ఎక్కుడుంది? – ఈ రోజు వచ్చి మనకు బలం లేదు.. ఎదిగే పార్టీ అని ఏడిస్తే ఎలా? – మమ్మల్ని తిట్టి, సినిమా డైలాగులు చెప్తే ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడో అర్ధం అవుతుంది. – చంద్రబాబుది వెనకా ముందుకు పోలేని పరిస్థితి. కాపు ఓట్లు తనకు కావాలి..దాని కోసం ఎల్లో మీడియాలో పవన్ ఇమేజ్ పెంచాడు. – దీంతో అంచనాలు పెరిగి ఆయన అభిమానులు నువ్వు సీఎం అవుతావా అని అడిగారు. – ఇప్పుడు ఆ ఆశ నెరవేరకపోతే ఆ ఓట్లన్నీ పోయి బూమ్రాంగ్ అవుతుందనేది ఈ రోజు కనిపిస్తోంది. – మేం ముందు నుంచి చెప్తున్నట్లు జనసేన అనేది చంద్రబాబు పెట్టుకున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ. – పోనీ ఆయన్ను పార్టీలో నేరుగా పెట్టుకుంటే ఎవరూ మద్దతు పలకరు. అందుకే జనసేన ముసుగు వేశాడు. – వాళ్లకు సీట్ల దగ్గరే దెబ్బ పడింది. తాడేపల్లిగూడెం సభను చూశాక వారి పని క్లోజ్ అయిందని అర్ధం అయిపోతోంది. – మేం అనుకున్న టార్గెట్కు మేం రీచ్ అవుతాం. – నిజంగా ఆయన్ను అభిమానించే వారు పవన్ సీఎం కావాలని కోరుకుంటారు తప్ప చంద్రబాబు సీఎం కావాలని వారికెందుకు ఉంటుంది? – వారు పవన్ కల్యాణ్ పై ఆశలు పెట్టుకున్నారు. అది కాలేదు. – అందుకే ఆరు నెలల నుంచి పవన్ కల్యాణ్ సీట్లు ముఖ్యం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. – ఇది వాళ్లకు అప్పుడు ఎక్కలేదు. ఇప్పుడు స్పష్టంగా అర్ధమైంది. అదంతా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతోంది.