చంద్రబాబుకి ప్రజలు ఎప్పుడో బైబై చెప్పారు

 తనకు తానే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఒప్పుకున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: చంద్రబాబుకు పాలన చేత కాదని, అందుకే ప్రజలు 2019 ఎన్నిక‌ల్లోనే బై బై బాబు అని ఇంటికి పంపించారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు పోటీలో ఎక్కడా లేడు. అధికారం అనేది ఇద్దరు వ్యక్తులు నిర్ణయించేదు కాదు… ప్రజలు నిర్ణయించాలన్న స్పృహ కూడా చంద్ర‌బాబుకు లేనట్లు ఉంద‌న్నారు . అధికారం అప్పనంగా రావటం వల్ల ఈ అహంకారం వచ్చిందన్నారు. తనకు తానే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఒప్పుకున్నాడన్నారు. 

పులివెందుల గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం
చంద్ర‌బాబు తన స్వంత నియోజకవర్గం కుప్పంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలుపుకోలేక పోయాడు. పులివెందుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సజ్జల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటం విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలనున్న ప్రయత్నం మరోసారి బయటపడింది. కోర్టు తీర్పుతో ఈ విషయం తేలిపోయిందన్నారు. ఆక్రమణలను తొలగించటానికి అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సభకు భూమి ఇచ్చిన వారిలో ఎవరి ఇల్లు కూలిందో పేర్లు ఇవ్వమంటే పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పటం లేద‌న్నారు. 

తాజా వీడియోలు

Back to Top