రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సోషల్ మీడియా మీ అరాచకాలను బయటపెట్టిందనేనా ఈ ఏడుపు?
04 Oct 2019 3:22 PM
వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: మీ బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచిపెట్టినా మీ అరాచకాలన్నింటినీ సోషల్ మీడియా బయటపెట్టిందనేనా ఈ ఏడుపు అని చంద్రబాబును ఉద్దేశించి వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ తమపై దారుణంగా ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలనను విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. వైయస్ఆర్సీపీ పైనా, వైయస్ జగన్ గారి పైనా నీచపు రాతలు రాసేందుకు వేలమందిని నియమించి 24/7 కాల్ సెంటర్లను నిర్వహించింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబుగారూ! అంటూ విజయసాయి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు.
సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు పోస్టులు పెట్టుకుంటారని, మీకు నచ్చకపోతే ఎఫ్ బీ కి ఫిర్యాదు చేయొచ్చని హితవు పలికారు. చంద్ర'జ్యోతి' ఎంత చిచ్చు పెట్టాలని చూసినా లాభం లేకుండా పోయిందన్నదే సారు అసలు బాధ అంటూ ఎద్దేవా చేశారు. అయినా మీ పుత్రరత్నం పెట్టిన ట్వీట్లేమైనా సుమతీ శతకాల్లా అనిపిస్తున్నాయా? అని విజయసాయిరెడ్డి నిలదీశారు.
"సిగ్గులేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లే ఫస్టుంటాయి. ఆ లిస్టులో కిరసనాయిలు తప్పనిసరిగా ఉంటాడు. వీళ్లు జన్మలో మారరు. వీళ్ల దృష్టిలో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛకు నిర్వచనాలు వేరే ఉంటాయి" అంటూ మండిపడ్డారు.