న్యూఢిల్లీః మా అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారని వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. కులం,అవినీతితో పెచ్చరిల్లిన టీడీపీని కూకటివేళ్లతో పెకలించివేశారన్నారు.అవినీతి రహిత రాష్ట్రంగా చేయాలని ఏపీ సీఎం జగన్ తపన పడుతున్నారన్నారు.దాని ద్వారా ఏపీని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారన్నారు.ఏపీకి హోదా ఇవ్వాలని ఇటీవల నీతిఆయోగ్ సమావేశంలో జగన్ కోరారని తెలిపారు.విభజనకు షరతుగా పార్లమెంటులో ఇచ్చిన హోదా హామీ నిలబెట్టుకోవాలన్నారు.నాడు విభజన ప్రక్రియలో ఉన్న రాజ్యసభ ఛైర్మన్ ఏపీకి న్యాయం చేసేందుకు సహకరించాలన్నారు.పోలవరాన్ని సవరించిన అంచనాలతో నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కోరారు.పోలవరంలో జరిగిన అవినీతిని నిర్మూలించాలన్నారు.కడప,స్టీల్ప్లాంట్,దుగరాజపట్నం పోర్టు,విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్,కాకినాడ పెట్రో కారిడార్ను పూర్తిచేయాలన్నారు.విశాఖ జోన్లో మినహాయించిన శ్రీకాకుళం,విజయనగరం ప్రాంతాలను చేర్చాలన్నారు.ఎవరైనా పార్టీ మారితే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో పాస్ చేయించాలన్నారు.సీఎం జగన్ అంగన్వాడీల జీతాలను మూడు వేల నుంచి పదివేలకు పెంచారని అదేవిధంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీల జీతాలను పెంచాలన్నారు.