కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
ఎన్నికల్లో ఓడించారనే దళితులపై చంద్రబాబుకు పగ
31 Jul 2021 1:28 PM
దళితులపై దాడి వెనక బాబు పాత్ర కూడా ఉంది
వైయస్ఆర్ సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
తాడేపల్లి: చంద్రబాబు దళిత ద్రోహి అని మరోసారి నిరూపించుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రావడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు తీరుపై ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పాము పగబట్టినట్టు చంద్రబాబు దళితులపై పగబట్టారని, దళితులపై దాడి చేసిన దేవినేని ఉమా ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై టీడీపీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు మరోసారి దళిత ద్రోహి అని నిరూపించుకున్నారని, దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర కూడా ఉందన్నారు.