జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
చంద్రబాబు దళిత వ్యతిరేకి
29 Aug 2020 4:02 PM
వైయస్ఆర్ సీపీ ఎంపీ నందిగం సురేష్
తాడేపల్లి: అధికారంలో ఉండగా దళితులను అడుగడుగునా అవమానించిన చంద్రబాబు.. అధికారం కోల్పోయాక కపట ప్రేమ చూపిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులపై ఎవరైనా దాడులు చేస్తే సహించేది లేదని, దళితులపై దాడులు జరిగితే సీఎం వైయస్ జగన్ వెంటనే చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎంతటివారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు హైదరాబాద్లో దాక్కున్ని రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని మండిపడ్డారు.