సమర శంఖారావంతో ఎన్నికలకు సమాయాత్తం..

వైయస్‌ఆర్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

రేపు తిరుపతిలో జరగబోయే సమర శంఖారావం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీసీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ఈ సభకు చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు.ఇప్పటికే నియోజక,జిల్లా స్థాయిలో బూత్‌ కమిటీ కన్వీనర్లకు,సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.సమర శంఖారావం ద్వారా  వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయబోతున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌స్‌ఆర్‌సీపీ గెలపునకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సదస్సు ద్వారా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారని తెలిపారు.

–ఏర్పాట్లు పూర్తి: తలశిల రఘురాం..

రేపు ఉదయం 11.30 గంటలకు వైయస్‌ జగన్‌ తిరుపతికి చేరుకుంటారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మ«ధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం తనపల్లి క్రాస్‌ రోడ్డు సమీపంలోని పిఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో తటస్థుల సదస్సులో  పాల్గొంటారన్నారు.అనంతరం 1 గంటలకు సభాస్థలికి చేరుకుని సమర శంఖారావం సభలో ప్రసంగిస్తారని తెలిపారు.సుమారు 40వేల మంది వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top