కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
గతంలో ప్రాజెక్టు వద్ద పోలీసులు కొట్టుకున్నారు..లోకేష్ మర్చిపోయారా?
09 Jul 2021 12:01 PM
అప్పట్లో కేసీఆర్కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు
జలవివాదాన్ని పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రానిదే
ఎమ్మెల్యే ఆర్కే రోజా
తిరుమల: గతంలో ప్రాజెక్టు వద్ద పోలీసులు కొట్టుకున్న విషయాన్ని లోకేశ్ మర్చిపోయారా? అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై టీడీపీ నేతల తీరును ఆమె తప్పుపట్టారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ హయాంలో రైతులను దగా చేశారని ఆరోపించారు. రైతుల కోసం ఏపీ సీఎం వైయస్ జగన్ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పిన ఆమె, వివిధ పథకాల ద్వారా 83 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేశారని తెలిపారు.
సీఎం వైయస్ జగన్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే చంద్రబాబు, లోకేశ్ మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
టీడీపీ కోవర్టుగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆమె ఆరోపించారు. అప్పట్లో కేసీఆర్కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారని ఈ విషయం రేవంత్కి గుర్తు లేదా? అని ఆమె నిలదీశారు. రాష్ట్ర విభజన అనంతరం 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉండకుండా అక్కడి నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అని ఆమె ప్రశ్నించారు.