స్పీకర్‌ను అవమానపర్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య

ఎమ్మెల్యే ఆర్కే  రోజా
 

అమరావతి: సభా సంప్రదాయాలు,విలువలు గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించేవిధంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ  మంచి,చెడు గురించి మాట్లాడుకునేటప్పుడు ఉదాహరణలుగా గతాన్ని తీసుకుంటాం.. వాటిపై ఈ సభలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారన్నారని ప్రశ్నించారు.  స్పీకర్‌ను అవమానించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు.ఇది మొదటి సారి కాదని...గతంలో కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌ అయినప్పుడు ఆయనను అవమానించారని..అదేవిధంగా నేడు తమ్మినేని సీతారాం  స్పీకర్‌ అయినప్పుడు అగౌరవపర్చడం చాలా బాధాకరమన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి  క్షమాపణ  చెప్పాలని ప్రతి పక్ష నాయుకులు కోరుతున్నారని.. గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటలకు లెంపకాయలు వేసుకున్న సరిపోదన్నారు.గొప్పగా ఫొటోలు పెట్టుకుని వర్ధంతులకు,జయంతులకు ఎన్టీఆర్‌ గురించి గొప్పగా మాట్లాడడమే గాని, ఆయన స్థాపించిన పార్టీని లాక్కుని, ఆయనకు వెన్నుపోటు పోడిచి..శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా యనమల రామకృష్ణున్ని ఉపయోగించుకుని.. సభాపతి స్థానాన్ని ఎలా భ్రష్టుపట్టించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు.గత అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో మహిళలను వ్యభిచార కూపంలో దింపుతుంటే..వాయిదా తీర్మానం ఇచ్చిన నా నోరు నొక్కడానికి సంవత్సరం పాటు సస్పెండ్‌ చేయడం న్యాయమా అని అడుగుతున్నా..సుప్రీంకోర్టుకు వెళ్ళి  గెలిచి ఎంట్రి ఆర్డర్‌తో వస్తే కనీసం న్యాయస్థానాన్ని కూడా గౌరవించకుండా నన్ను మార›్షల్‌చే బయటకు గెట్టించారన్నారు. నేడు సభా సంప్రదాయాలు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయిన తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలియజేశారు.అత్యుత్తమ స్థానంలో వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేనికి ఈ అవకాశాన్ని కల్పించిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

 

తాజా వీడియోలు

Back to Top