మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టీడీపీ హయాంలో ఇసుక దోపిడీ
30 Aug 2019 5:12 PM
ఇసుక గురించి టీడీపీ ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
అమరావతి: ఏపీలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ వాళ్లు ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు, ఆయన కొడుకు ఒక ఇంటిని ఆక్రమించుకుని నివసిస్తున్నారని, గతంలో వారి ఇంటి వెనుక డ్రెడ్జర్ల సాయంతో ఇసుకను తవ్వితే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పెనాల్టీ విధించిన విషయాన్ని వారు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీని పలువురు అధికారులు అడ్డుకున్నారని, ఓ మహిళా అధికారిపై నాడు టీడీపీ ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారని విమర్శించారు. నాడు మహిళా అధికారికి అండగా నిలబడాల్సిన చంద్రబాబు, తమ ఎమ్మెల్యేను సమర్థించుకున్నారని, అటువంటి వ్యక్తి ఈరోజున ఇసుక దోపిడీ గురించి మాట్లాడటం కన్నా అన్యాయం, దారుణం ఇంకేమైనా ఉంటుందా అని అన్నారు.
బొత్స వాస్తవం చెబితే ప్రతిపక్షం రాద్ధాంతం తగదు
రాజధాని గురించి మంత్రి బొత్స సత్యనారాయణ వాస్తవ పరిస్థితులు చెప్పారని, వరద నీరు వస్తే అక్కడి పరిస్థితి ఎలా ఉందో చెబితేనే దానిపై ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని ఆర్కే విమర్శించారు. చంద్రబాబునాయుడు తన అనుకూల మీడియాతో దీనిపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేయొద్దని మేధావులు, కమిటీలు చేసిన సూచనలను చంద్రబాబు నాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ తప్పుల వల్ల భావితరాలు దెబ్బతింటాయన్న వాస్తవాన్ని బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టడం కరెక్టు కాదని అన్నారు.