టీడీపి నేతలను చంద్రబాబే రెచ్చగొడుతున్నారు

వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జోగిపై రౌడీయిజం చేస్తారా బాబూ..?

 చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.

 లోకేష్ ఇవే కుట్రలు కొనసాగిస్తే ఎదురు దెబ్బలు తప్పవు

 అయ్యన్నపాత్రుడు తినేది అన్నమా లేక గడ్డినా..?

  కుల,మత,ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

  చంద్రబాబు, టిడిపి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదు.

 అయన్నపాత్రుడితో చంద్రబాబే అలా మాట్లాడించారు

 శాంతియుతంగా నిరసన తెలియచేసేందుకు వెళ్లిన జోగిరమేష్ పై దాడి దుర్మార్గం.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున
 

తాడేప‌ల్లి:  టీడీపి నేతలను చంద్రబాబే రెచ్చగొట్టి  ముఖ్యమంత్రి గారిని, వైయస్సార్ కాంగ్రెస్ నేతలను బూతులు తిట్టిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. అయ్యన్నపాత్రుడితో నిన్న ఆ విధంగా మాట్లాడించింది చంద్రబాబే అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మేరుగు నాగార్జున, లేళ్ళఅప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
 కుల, మత, ప్రాంతాల మధ్య బాబు చిచ్చు:  లేళ్ళ అప్పిరెడ్డి  
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన మా పార్టీ ఎంఎల్ ఏ శ్రీ జోగి రమేష్ పై టిడిపి నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేశారన్నారు. రౌడీలను, చిల్లర గాళ్లని ఇంట్లో పెట్టుకుని చంద్రబాబు  దాడి చేయించారని అన్నారు. కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. టిడిపి నేతల తీరు చూస్తే దొంగే దొంగా...దొంగా అన్నట్లుగా ఉందన్నారు. మా సహనాన్ని పరీక్షించవద్దు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టిడిపి నేతలకు హితవు చెప్పారు. ఎంపీటీసీ, జ‌డ్పిటీసీ ఎన్నికలలో టిడిపి ఓటమిని ముందే గ్రహించి, ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు. టిడిపి నేత బుద్దా వెంకన్న నాటకాలు అందరికీ తెలుసని విమర్శించారు. చంద్రబాబు తక్షణమే వైయస్ జగన్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి వివాదాలతో నాయకుడు అవ్వాలని లోకేష్ చూస్తున్నాడని, లోకేష్ ఇలాగే వ్యవహరిస్తే ఎదురు దెబ్బలు తప్పవని వ్యాఖ్యానించారు.

      అయ్యన్నపాత్రుడు అన్నం తింటున్నాడా...గడ్డి తింటున్నాడా:  మేరుగు నాగార్జున  
అయ్యన్నపాత్రుడు అన్నం తింటున్నాడా...గడ్డి తింటున్నాడా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని గతంలో వ్యాఖ్యానించి అవమానించారన్నారు. బిసిలు తమ సమస్యలను పరిష్కరించాలని వస్తే తోకలు కత్తిరిస్తానని హేళనగా మాట్లాడి అవమానించారన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలకోసం  అమలు చేస్తున్నసంక్షేమ పథ‌కాలను చూడలేక టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. గౌరవనీయమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని గురించి అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళని  ప్రశ్నించడానికి మా ఎమ్మెల్యే జోగి  రమేష్ వెళ్తే రౌడీయిజం చేయిస్తారా.....? ఇలానే వ్యవహరిస్తే.. రాష్ట్రంలో ఎక్కడా కూడా టీడీపీ నేతల్ని కాలు పెట్టకుండా చేస్తాం. గుర్తు పెట్టుకో చంద్రబాబు. దళిత  గిరిజన బహుజనుల్ని టార్గెట్ చేస్తే జాగ్రత్త. జోగి రమేష్  పై దాడిని  ఖండిస్తున్నాం అని తెలియచేశారు. టిడిపి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మేరుగ నాగార్జున‌ హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

Back to Top