నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
బాబు హయాంలో దళితులు భయంతో బతికారు
27 Aug 2020 2:49 PM
దగాపడ్డ దళిత నేతలు సీఎం వైయస్ జగన్పై పుస్తకం రాశారు
దళితుల మీద చంద్రబాబు అండ్ కో కపట ప్రేమ
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
తాడేపల్లి: చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం దళితులు భయబ్రాంతులతో బతికారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో దళితులపై దాడుల్లో రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉండేదని, టీడీపీ హయాంలో దళితులపై జరిగిన దాడులపై త్వరలో ఒక పుస్తకం విడుదల చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.
దళిత చట్టాలను చుట్టాలుగా మార్చారు..
దళితుల మీద చంద్రబాబు అండ్ కో కపట ప్రేమ చూపిస్తున్నారని మేరుగ మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో దగాపడ్డ దళిత నేతలు వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద పుస్తకం విడుదల చేశారు. చంద్రబాబు తన పాలనలో దళిత చట్టాలను చుట్టాలుగా మార్చారు. దళితుల్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు అన్నప్పుడే దేశం నెవ్వరిపోయింది. దళితులపై దాడుల విషయంలో చంద్రబాబు మీద పుంకాలు పుంకాలుగా పుస్తకాలు వేయగలమని చెప్పారు.
బాబు సొంత ఊరిలో కూడా దళితులపై దాడులు..
దళిత చట్టాలను చంద్రబాబు అపహాస్యం చేశారు.అంబేద్కర్ విగ్రహం పెడతామంటే 54 రోజులు పాటు దళిత కుటుంబాలను వెలివేశారు. జెర్రిపోతులపాలెంలో మీ ఎమ్మెల్యే దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. చంద్రబాబు సొంత ఊరిలో కూడా దళితులపై దాడులు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలు రాయిస్తున్నారు. పెద్దిరెడ్డికి దళిత యువకుడి మరణంకు సంబంధం లేదని చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యలు స్పష్టం చేశారు. దళితులపై ఎవరు దాడి చేసిన క్షమించేది లేదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిచెప్పారు. దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి. బడుగు బలహీన వర్గాలకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి 60 శాతం మంత్రి పదవులు కట్టబెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదుగురు దళితులకు తన కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్సీకి హోమ్ మంత్రి పదవి, ఎస్టీకి డీజీపీ పదవి కట్టబెట్టిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను చంద్రబాబు దారి మళ్లించారు. దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని మేరుగ నాగార్జున తెలిపారు.