నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ పాలన
17 Jul 2020 6:20 PM
ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతి మండలి సమావేశ నిర్ణయాలు ఆనందానిచ్చాయి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతి మండలి 6వ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆనందాన్నిచ్చాయన్నారు. విశాఖలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని, దళితుల ఓట్ల కోసం బూటపు హామీలిచ్చి గత ఐదేళ్లు మోసం చేశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉందని మేరుగ నాగార్జున అన్నారు. ఎస్సీల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మూడు రాజధానులను ప్రకటించారన్నారు. విశాఖకు రాజధాని రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు తన తీరు మార్చుకోకపోతే టీడీపీ మనుగడ కష్టమేనన్నారు.