మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అన్ని ప్రాంతాలను అభివృద్ధే సీఎం వైయస్ జగన్ లక్ష్యం
04 Jan 2020 11:13 AM
విశాఖ: అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలని బీసీజీ నివేదిక ఇచ్చిందన్నారు. విశాఖలో శనివారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని గతంలో శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలు చెప్పాయని గుర్తు చేశారు. పరిపాలన, అభివృద్ధి ఒక చోట జరగడంతోనే మనం నష్టపోయామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబు మాత్రం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు, నిధులు, పరిపాలన ఇవ్వాలన్నదే మా లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. మరో లక్ష కోట్లు తెచ్చి అమరావతిలోనే పెడితే..మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలన్నారు. చంద్రబాబు తీరును ఏ ప్రాంత ప్రజలు హర్షించడం లేదన్నారు. భూముల రేట్లు తగ్గుతున్నాయని చేసే వాటిని ఉద్యమం అంటారా అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. రాజధాని రైతులకు తప్పకుండా సీఎం వైయస్ జగన్ న్యాయం చేస్తారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఐగడం మానేసి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.