చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
విశాఖ ఎమ్మెల్యేలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం
13 Nov 2020 5:41 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్
విశాఖ: విశాఖ ఎమ్మెల్యేలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఎల్లోమీడియాలో వచ్చిన కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానానికి, ఎమ్మెల్యేలకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. అనకాపల్లిలో 'నాడు నేడు' కార్యక్రమం సక్రమంగా జరగాలనే తాను అన్నానని... తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని అన్నారు. సీఎం వైయస్ జగన్ నుంచి తమకు అసలు పిలుపే రాలేదని.. తాము అమరావతికి వెళ్లనే లేదని... ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వార్తలు రాశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్తో కొత్త జిల్లాల ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించినట్లు చెప్పారు.