ప్రత్యేక హోదా వ‌చ్చేదాకా పోరాడుతాం

వైయ‌స్ఆర్ ‌సీపీ  లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి
 

న్కూఢిల్లీ : నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై  పార్ల‌మెంట్‌లో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వైయ‌స్ఆర్ ‌సీపీ  లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.   అవకాశం వచ్చినా ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తుతూనే ఉంటామని తెలిపారు. సోమవారం నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు నేపథ్యంలో బిజినెస్‌ ఎడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వైయ‌స్ఆర్ ‌సీపీ  లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. భేటీ అనంరతం ఆయన వివరాలను వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్‌ కోరినట్లు తెలిపారు.  

ఉచిత విద్యుత్ కొనసాగుతుంది..

ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందన్నారు. విపక్షాలకు అంశాలు లేక తమపై అనవసరమైన నిందలు వేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ మీటర్ల విషయంలో ఎవరు ఆందోళనలో చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశాని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. 

Back to Top