మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
అయ్యన్నపాత్రుడు మద్యం, గంజాయి సేవించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
18 Sep 2021 11:32 AM
వైయస్ఆర్సీపీ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు
నర్సీపట్నం: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మద్యంతోపాటు గంజాయి కూడా సేవించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన సోదరుడు, వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ఘాటుగా విమర్శించారు. తన సతీమణి, డీసీసీబీ చైర్పర్సన్ అనితతో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి పిచ్చి మరింత ముదిరిందని.. బూతులు తప్ప ఆయన నోటి నుంచి మంచి మాటలు రావటంలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా మనసారా ప్రేమించే ముఖ్యమంత్రిని, హోంమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడే హక్కు ఆయనకు ఎవడిచ్చాడన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన స్క్రిప్ట్తో అయ్యన్నపాత్రుడు నోటికి వచి్చనట్లు మాట్లాడుతున్నాడన్నారు. గంజాయి వ్యాపారం, దోపిడి, భూకబ్జాలు, రౌడీయిజం చేసే అయ్యన్నపాత్రుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంకు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అయ్యన్నపాత్రుడిని సన్యాసిపాత్రుడు హెచ్చరించారు.