రాధా..ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సామినేని ఉదయభాను

వంగవీటి రంగా ఎదుగుదలకు వైయస్‌ఆర్‌ తోడ్పాటు

వంగవీటి రాధాకు వైయస్‌ జగన్‌ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు

ఈ నాలుగేళ్లలో పార్టీ కోసం రాధా ఏదైనా ఉద్యమం చేశారా?

రంగాను హత్య చేసింది టీడీపీ గుండాలే

టీడీపీ కాదని రాధా చెప్పడం బాధాకరం

 

హైదరాబాద్‌: వంగవీటి రాధా ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలపై  ఒక్కసారి  ఆత్మపరిశీలన చేసుకోవాలని వైయస్ఆర్ సీపీ నాయకులు సామినేని ఉదయభాను సూచించారు. వైయస్ జగన్ పై రాధా చేసిన వ్యాఖ్యలను ఉదయభాను ఖండించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో  ఆయన మీడియాతో మాట్లాడారు. వంగవీటి రంగా ఎదుగుదలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగానో ప్రోత్సహించారన్నారు. రంగాను హత్యా చేసే ముందు రోజు తాను కలిశానన్నారు. తెలుగు దేశం పార్టీ జెండాలు కట్టుకొని బస్సులో వచ్చి రంగాను హత్యా చేశారన్నారు. టీడీపీ గుండాల చేతుల్లో రంగా హత్యగావించబడ్డారన్నారు. ఇవాళ వంగవీటి రాధా విజయవాడలో మాట్లాడుతూ..నా తండ్రిని చంపింది ఒక పార్టీ కాదని, కొంత మంది వ్యక్తులు అని చెప్పడం వంగవీటి రంగా అభిమానులు చాలా బాధపడుతున్నారని చెప్పారు. రంగా హత్యా సమయంలో హరిరామజోగయ్య ఆనాటి కేబినెట్‌లో ఉండి తన పుస్తకంలో రాశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని, కోడెల శివప్రసాద్‌రావు ప్రమేయం ఉందని చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల కబంధహస్తాల్లో రాధా చిక్కుకున్నారని తెలిపారు.

వైయస్‌ జగన్‌ వంగవీటి రాధాను ఓ తమ్ముడిలా చూసుకుంటానని, మీ తండ్రి మాదిరిగా నిన్ను మంచి నాయకుడిగా గుర్తిç్తస్తానని చెప్పారని, వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. ఏడాది పాటు తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించలేకపోయారన్నారు. అందరి కన్న రాధా అంటే వైయస్‌ జగన్‌కు ఓ ప్రత్యేకత, ప్రేమ ఉండేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొనమని వైయస్‌ జగన్‌ సూచించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాధాను నియమించినా ఆయన తన బాధ్యతలు సరిగా నెరవేర్చలేకపోయారన్నారు.

విజయవాడ నగరంలో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారన్నారు. విజయవాడ సిటీ అధ్యక్షుడిగా ఉన్న రాధా..నీ ఆత్మ సాక్షిగా ఆలోచించూ..పార్టీ కార్యక్రమాల్లో ఎన్నిసార్లు పాల్గొన్నారో మీరే చెప్పాలన్నారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తొలగించారన్నారు. వైయస్‌ జగన్‌ ఇలాంటి చర్యలను క్షమించలేదని, చంద్రబాబు వంచనలపై ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. నీ తండ్రి రంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారని, నీవు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. నీవు ఎక్కడా కనిపించినా వైయస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాధా ..ఒక్కసారి పునరాలోచించుకో అని ఉదయభాను సూచించారు. నీ తండ్రిని హత్య చేసిన టీడీపీలో చేరడం బాధాకరమన్నారు. రంగా ఆత్మ ఘోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. రంగా అభిమానులు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రాధా వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడుతున్నారని..ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోవాలని సూచించారు. 

 

Back to Top