చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ అనుకున్నది సాధిస్తారు
24 May 2019 11:51 AM
రాజన్న రాజ్యం తీసుకొస్తారు..
పాదయాత్రే జననేతను గెలిపించింది
వైయస్ఆర్సీపీ నాయకులు మోహన్బాబు
తిరుపతి: ప్రజలకు మంచి చేయాలనే తపన వైయస్ జగన్మోహన్రెడ్డిలో కనబడుతుందని వైయస్ఆర్సీపీ నాయకులు మోహన్బాబు అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు భరోసాగా నేను ఉన్నానని వైయస్ జగన్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ప్రజలు వైయస్ జగన్కు పట్టం కట్టడంతో చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ తనయుడిగా వైయస్ జగన్మోహన్రెడ్డి ఆయన బాటలో నడుస్తూ ప్రజలందరికి మేలు చేస్తారని తెలిపారు.వైయస్ జగన్మోహన్రెడ్డిపై భగవంతుడు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.పాదయాత్రే వైయస్ జగన్ను గెలిపించిందన్నారు.వైయస్ జగన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు.