రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
రాజన్న రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
07 Feb 2019 2:46 PM
వైయస్ఆర్సీపీ నేత ఆకేపాటి అమర్నాథ్రెడ్డి
వైయస్ జగన్కు తోడుగా ఉందాం
వైయస్ఆర్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజ్యం తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైయస్ఆర్సీపీ నేత ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. కడప శంఖారావం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..గత పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో వైయస్ జగన్ ఎన్నో సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో రాజన్న పాలన తెచ్చేందుకు వైయస్ జగన్ కృషి చేస్తున్నారు. ఈ జిల్లా వైయస్ఆర్ జిల్లా అని, ఈ జిల్లా వైయస్ రాజశేఖరరెడ్డికి జన్మనిచ్చిన గడ్డ అన్నారు.
ఈ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయి జిల్లాకు సాగునీరు, తాగునీరు ఇచ్చారన్నారు. వైయస్ఆర్ మరణం మనకు దురదృష్టకరమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించిన గొప్పనేత వైయస్ఆర్ అన్నారు. వైయస్ జగన్ ఈ రాష్ట్రానికి నేనున్నానని వైయస్ఆర్సీపీని స్థాపించారన్నారు. ఈ జిల్లావాసులంతా వైయస్ జగన్ వెంట నడుస్తున్నారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంతో పాటు జిల్లా అభివృద్ధి సాధిస్తుందన్నారు. వైయస్ జగన్కు అందరం తోడుగా ఉందామని పిలుపునిచ్చారు.