శాసనమండలి పదవుల్లోనూ సామాజిక న్యాయం

పదవుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే

మొత్తం 14కు గానూ 7 స్థానాలు బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయింపు

కౌన్సిల్‌ చరిత్రలో తొలిసారి మైనార్టీల నుంచి నలుగురు వైయస్‌ఆర్‌ సీపీ సభ్యులు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: శాసనమండలి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించామని, స్థానిక సంస్థలకు సంబంధించిన 11 మంది వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారన్నారు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చే మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించామని, పాలవలస విక్రాంత్, ఇసాక్‌ బాషా, డీసీ గోవిందరెడ్డిల పేర్లను ప్రకటించామన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్‌ నాయకులతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం ఖరారు చేశారన్నారు. 14 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఇందులో 7 స్థానాలు బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించగా.. మిగిలిన 7 స్థానాలను ఓసీలకు కేటాయించారన్నారు. 50 శాతం బీసీ, ఎస్సీ, మైనార్టీలకు కేటాయించారన్నారు. సామాజిక న్యాయం గురించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ముందునుంచి ప్రయత్నం చేస్తున్నారని, అదే కొనసాగిస్తున్నారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ వస్తున్నామన్నారు. దీని వల్ల కొద్దిమంది సీనియర్‌ నాయకులు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చినా.. భవిష్యత్తులో వారికి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందన్నారు. 

స్థానిక సంస్థలకు సంబంధించిన 11 మంది వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో 18 మంది వైయస్‌ఆర్‌ సీపీ సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని చెప్పారు. ఇప్పుడిస్తున్న 14 స్థానాలతో కలిపి మొత్తం 32 స్థానాల్లో 18 మంది సభ్యులు బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నారన్నారు. కౌన్సిల్‌ చరిత్రలో తొలిసారి నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. 

8 జిల్లాల నుంచి 11 స్థానాలకు ఎన్నికలు 
విజయనగరం జిల్లా : ఇందుకూరు రఘురాజు (క్షత్రియ, ఓసీ) 
విశాఖపట్నం : వరుదు కల్యాణి (కొప్పుల వెలమ, బీసీ), వంశీకృష్ణయాదవ్‌ (యాదవ్, బీసీ) 
తూర్పుగోదావరి : అనంత ఉదయభాస్కర్‌ (కాపు, ఓసీ) 
కృష్ణా జిల్లా : తలశిల రఘురాం (కమ్మ, ఓసీ), మొండితోక అరుణ్‌కుమార్‌ (మాదిగ, ఎస్సీ) 
గుంటూరు : ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (కాపు, ఓసీ), మూరుగుడు హనుమంతరావు (చేనేత, బీసీ) 
ప్రకాశం : తూమాటి మాధవరావు (కమ్మ, ఓసీ)
చిత్తూరు : వైయస్‌ఆర్‌ సీపీ కుప్పం ఇన్‌చార్జ్‌ భరత్‌ ( వన్యకుల క్షత్రీయులు, బీసీ) 
అనంతపురం : వై.శివరామిరెడ్డి (రెడ్డి, ఓసీ)
 

Back to Top