టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు నెల్లూరు ప్రజలు గుణపాఠం చెప్పాలి

వైయస్‌ఆర్‌ సీపీ  ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

నెల్లూరు:  టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు నెల్లూరు ప్రజలు గుణపాఠం చెప్పాలని  వైయస్‌ఆర్‌ సీపీ  ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై వైయస్‌ఆర్‌సీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ..సీఎం వైయస్‌ జగన్‌ కులమతాలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శమన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌ 54 డివిజన్లలో క్లీన్‌స్వీప్‌ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. 

 

Back to Top