చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
బీసీలకు చంద్రబాబు అన్యాయం..
30 Jan 2019 2:00 PM
ఓట్లు కోసమే బీసీలను వాడుకుంటున్నారు..
వైయస్ఆర్సీపీ బీసీ గర్జనను విజయవంతం చేయాలి...
వైయస్ఆర్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి
విజయవాడ: రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని వైయస్ఆర్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారన్నారు.బీసీల అభివృద్ధికి, వారి జీవన ప్రమాణస్థాయిలను పెంచడానికి వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది క్రితమే బీసీ అధ్యయన కమిటీ వేశారన్నారు. బీసీ నేత జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అధ్యయన కమిటీ 13 జిల్లాల్లో పర్యటించి, అన్నివర్గాల బీసీ కుల వృత్తులవారిని కలిసి.. వారి సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిందన్నారు.
వచ్చేనెల ఫిబ్రవరి 17న బీసీ గర్జనలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏవిధంగా మేలు చేయబోతున్నామో..బీసీ డిక్లరేషన్ చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం చేయడానికి దశ,దిశా నిర్ణయించబోతున్నామన్నారు. బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరారు.