వైయ‌స్ వివేకా హ‌త్య‌పై చంద్రబాబు కుట్రపూరిత వ్యూహం

చంద్రబాబు చేతిలో సునీతమ్మ పావులా మారారు

వివేకా సొంత కుటుంబ స‌భ్యులే ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణం

మొద‌ట్లో ప‌ద్ధ‌తిగా సాగిన సీబీఐ విచార‌ణ.. ఆ త‌ర్వాత పూర్తిగా దారి మళ్లింది.. 

కేసులోకి నేరుగా శంకర్‌రెడ్డి, తర్వాత అవినాష్‌రెడ్డిని, చివరగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను లాగాల‌ని కుట్ర‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ కుట్రలు

చంద్ర‌బాబు, ఎల్లో మీడియా చేస్తోంది పూర్తిగా రాజ‌కీయ కుట్రే

ఓ వ్య‌వ‌స్థ‌ను అడ్డంపెట్టుకొని ప్ర‌జ‌ల్లో విషం ఎక్కించే కుట్ర జ‌రుగుతోంది

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి ఆత్మ‌క్షోభించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి: వైయ‌స్‌ వివేకా హత్యపై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంద‌ని, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక కుట్ర‌లు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎంత బురదజల్లుతున్నా ఇంతకాలం ఓపిగ్గా ఉన్నామ‌ని, వైయ‌స్ వివేకా సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణమ‌న్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సునీతమ్మ‌ ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనిపిస్తోంద‌న్నారు. ఒకరి తర్వాత ఒకరు పద్దతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా కుట్రపూరితంగా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంద‌న్నారు. చనిపోయిన వైయ‌స్‌ వివేకానంద‌రెడ్డి ఆత్మక్షోభించేలా వ్యవహరిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే.. 

గత కొన్ని నెలలుగా మా పార్టీ నాయకుడు వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్య గురించి అవాకులు, చెవాకులు పేలుతున్నారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయిన తర్వాత, అంటే 2020 మార్చి తర్వాత దర్యాప్తు రెండు, మూడు నెలలు ఒక పద్ధతిలో సాగింది. ఆ తర్వాత పూర్తిగా దారి మళ్లింది. ఒక్కసారిగా మా పార్టీ యువ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డికి ఈ హత్యలో ప్రమేయం ఉందని చెబుతున్నారు. నిజానికి ఆనాడు వైయ‌స్ అవినాష్‌ గెలుపు కోసం వైయ‌స్ వివేకానందరెడ్డి కృషిచేశారు. టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నడుపుతున్న రాజకీయాలు ఇవాళ మరో మలుపు తీసుకున్నాయి.

తొలి నుంచి కుట్రలు.. 
1999 తర్వాత సూట్‌కేసు బాంబు, అంతకు ముందు వైయ‌స్ రాజారెడ్డి హత్య కేసు, ఇంకా వైయస్సార్‌ అక్రమ మైనింగ్‌ అని రకరకాలుగా ప్రచారాలు చేశారు. శూన్యం నుంచి ఏదో సృష్టిస్తున్నారు. జనం మెదడుల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నింటికి మించి వైయస్సార్ దుర్మరణం తర్వాత వైయ‌స్ జగన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక నాటకానికి బీజం వేసి, నడుపుతూ వస్తున్నారు. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌తో కలిసి, స్వయంగా స్క్రిప్ట్‌ రాసి టీడీపీ రాజకీయం చేస్తోంది. ప్రజలు, ప్రజాకోర్టు టీడీపీకి అడ్రస్‌ లేకుండా చేసినా బుద్ది రాకుండా దాదాపు మూడేళ్లుగా అదే రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన మీడియా కలిసి కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఉన్న విలనిజమ్, దుర్మార్గం.. వాటికి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా.. ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకుని, రాజకీయంగా తీసుకుపోవాలని విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు.

స్క్రిప్ట్‌ ప్రకారం..
చివరకు ఆ హత్య కేసును పూర్తిగా వైయ‌స్ జగన్‌కు ఆపాదిస్తున్నారు. ఆ ప్రకారమే స్క్రిప్ట్‌ రాస్తున్నారు. ఇక్కడ స్కిప్ట్‌ అని ఎందుకు అంటున్నామంటే, సీబీఐ వారి సీఆర్పీసీ–161 రిపోర్టులు. వాటిని ఎవరు చదివినా సరే స్పష్టంగా ఒక్కటే అర్ధమవుతుంది. సాక్ష్యులు స్పష్టంగా చెప్పినట్లుగా లేకపోయినా.. ఈనాడు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 రోజూ విడుదల చేస్తున్న వాంగ్మూలాలు చూస్తుంటే.. దాని నుంచి టీడీపీ స్పందన. ఆ తర్వాత ట్వీట్లు ఒక వ్యూహం ప్రకారమే అని అర్థం అవుతుంది.

రాజకీయపరమైన దాడి.. 
ఆ విధంగా సీఎం వైయ‌స్ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్నారు. ఆయనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ పని చేస్తున్నారు. అందుకే దీన్ని రాజకీయపరమైన దాడిగా మేము భావిస్తున్నాం. దర్యాప్తు ఎలా జరుగుతున్నది అన్నది ఒక అంశమైతే, ఈ ముఠా ఆ ప్రక్రియను చేతిలో పెట్టుకుని, పూర్తిగా దారి మళ్లించే ప్రయత్నం చేస్తోంది అన్నది మరో అంశం. ఆ కుట్రను ఇవాళ మీడియా ద్వారా విజ్ఞులైన ప్రజలకు తెలియజేయాలనే ముందుకు వచ్చాం.

అనివార్యంగా మాట్లాడాల్సి వస్తోంది.. 
మేము అత్యంత గౌరవించే కుటుంబంలో భాగమైన వ్యక్తుల గురించి మాట్లాడకూడదని అనుకున్నామో.. వైయ‌స్ అవినాష్‌రెడ్డితో సహా.. కానీ ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా.. సీఆర్పీసీ–161 పేరుతో సీబీఐ రికార్డు చేసిందని, అవి కోర్టు ద్వారా రిలీజ్‌ అయ్యాయని ఆ పత్రికల్లో వస్తున్న విషయాలు. వివేకానందరెడ్డి కుమార్తె సునీతమ్మ, ఆయన భర్త రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలాలు బయటకు వచ్చాక.. వారు ఏ విధమైన జంకు లేకుండా అవినాష్‌రెడ్డివైపు వేలు చూపిన తర్వాత, ఇది వ్యక్తిగతమైందని మేము అనుకోవడం లేదు. అందుకే మౌనంగా ఉండకూడదని మాట్లాడుతున్నాం.

పావులుగా మారారు..
విత్‌ ఆల్‌ డ్యూ రెస్పెక్ట్‌ టు ఎవ్రీబడీ.. జగన్నాటకం ఆడిస్తున్న చంద్రబాబు చేతిలో పావులుగా మారారో లేక ఈ క్యారెక్టర్లు (సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి) ఆయనతో సహ పాత్రులో తెలియదు కానీ, ఒక పద్ధతి ప్రకారం ఒకే మాట మాట్లాడుతున్నారు. ఒక హత్య గురించి ఒక క్రియేటివ్‌ ఆర్టిస్ట్‌ తయారు చేసినట్లు సీబీఐ కూడా మారడం, ఇవన్నీ తయారు చేయడం చూస్తున్నాం.

అందుకే మౌనం వహించాం..
సీఎం వైయ‌స్ జగన్ ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన సమాధానం చెప్పలేక కాదు. తమ కుటుంబ సభ్యుల గురించి ఆయనకు మాట్లాడడం ఇష్టం లేదు. కడపు చింపుకుంటే కాళ్ల మీద పడుతుందని ఆయన స్పందించలేదు. కానీ వారు ఆయనపై నిందలు వేస్తున్నారు. పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా మేమడిగిన అయిదు ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇవ్వడం లేదు.

అవి ఎంత వరకు వాస్తవం?
నిజానికి సీబీఐ 161లో వాంగ్మూలం పేరుతో రాసిందని చెబుతున్న వాటిలో వాస్తవం ఎంత ఉందో తెలియదు. కానీ సునీతమ్మ మాట్లాడిందంటూ పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారు. కొత్త కొత్త పాయింట్లు చేర్చి మరీ రాస్తున్నారు. నిజానికి వాంగ్మూలాన్ని చెక్‌ చేస్తే, అనని మాటలు కూడా రాస్తున్నారు. ఇంకా ఇంకా సాగదీస్తున్నారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇష్టం వచ్చినట్లు అచ్చు గుద్దేస్తున్నారు. నిజంగా సునీతమ్మ, ఆమె భర్త అసలు అన్నారో తెలియదు. కానీ వాళ్లు ఈ వార్తలను ఖండించలేదు కాబట్టి, అన్నారే అనుకోవాలి. ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో కోడి కత్తి దాడి జరిగిందని, ఆ తర్వాత ఆయనకు చికిత్స పేరుతో సహాయం చేసిన వారికి మంచి పదవులు దక్కాయని వారన్నట్లు రాశారు. కానీ వాంగ్మూలంలో అది కనిపించలేదు. అలాగే హత్యకు ముందురోజు జమ్మలమడుగు వెళ్లి వచ్చిన వివేకానందరెడ్డి, తానే ఎంపీ అని అన్నట్లు, ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు రాశారు. కానీ నిజానికి ఆ విషయం కూడా వాంగ్మూలంలో కనిపించలేదు.

ఆ ప్రస్తావన ఎందుకు లేదు?
సీబీఐ అనే సీరియస్‌ దర్యాప్తు సంస్థ, నిజంగా తాము దర్యాప్తు చేస్తున్నప్పుడు, ఎవరైనా రాజకీయంగా మాట్లాడితే యధావిధిగా నోట్‌ చేస్తారా.? అసలు కోడికత్తి అని చెబితే సీబీఐ రాసుకుంటుందా? నిజానికి ఆ మాట అన్నది ఎవరు? టీడీపీ వాళ్లు కాదా?. వివేకానందరెడ్డి హత్య తర్వాత సాయంత్రం వరకు అక్కడ ఉన్న లేఖను బయటపెట్టలేదు. కానీ ఆ ప్రస్తావనే ఛార్జ్‌షీట్‌లో లేదు. అంత దారుణంగా సీబీఐ ఛార్జ్‌షీట్‌ ఉంది. తలాతోక లేకండా నేరుగా జంప్‌ చేసి రాశారు. ఎక్కడా పొంతన లేదు. 

పరస్పర విరుద్ధం..
వేలిముద్రలు దొరక్కుండా రక్తపు మరకలు తుడిచాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి జైలులో ఉన్నప్పుడు, ఆయనను సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి వెళ్లి కలిశారు. హత్య తర్వాత ఆయన కుటుంబ సభ్యులే ఫోన్‌ చేస్తేనే అక్కడికి అవినాష్‌రెడ్డి వెళ్తే, ఇప్పుడు ఆయనే నిందితుడు అంటున్నారు. అందుకే వ్యక్తిగతంగా లేదా ఆర్థికపరమైన లేదా రాజకీయపరంగా ఏదో ఒక కుట్ర ఇందులో ఉంది.

సీఎం వైయ‌స్ జగన్ వారి టార్గెట్‌.. 
2020 మార్చి వరకు జరిగిన సిట్‌ దర్యాప్తును ఏ మాత్రం పట్టించుకోకుండా, అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఒకే ఒక లక్ష్యంతో పని చేస్తుంది. కేసులోకి నేరుగా శంకర్‌రెడ్డిని, ఆ తర్వాత అవినాష్‌రెడ్డిని చివరగా సీఎం వైయ‌స్‌ జగన్‌ని లాగాలన్న ఉద్దేశంతోనే పని చేస్తున్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ని ఇవాళ  ఇన్ని ప్రశ్నిస్తున్నారు కదా. వివేకానందరెడ్డి హత్య తర్వాత రెండు నెలలకు పైగా చంద్రబాబు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఆయన నియమించిన బృందమే కేసు దర్యాప్తు కొనసాగింది. అయితే ఆ దర్యాప్తు సక్రమంగా లేకుండా, కుట్రలతో జరుగుతుంటే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

ఆనాడు ఆ పత్రికలో ఏం రాశారు..?
2019 మార్చి 17న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్తపలుకు రాశాడు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆమె అర్ధరాత్రి ఫోన్‌ చేసిందని, వివేకానందరెడ్డిది హత్య అని తెలిసినా, సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రాసుకొచ్చారు. వారి ఫోటోలూ ప్రచురించారు. ఆరోజు వివేకానందరెడ్డి కుటుంబం, వైయ‌స్‌ జగన్ కుటుంబం ఒకటే కాబట్టి ఆ కోణంలో రాశారు. వైయ‌స్‌ వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారని, వ్య‌క్తిత్వ హ‌న‌నం చేశారు. ఆ విధంగా సిగ్గు, ఎగ్గూ లేకుండా వ్యవహరిస్తున్నారు. 

చంద్రబాబు వ్యూహం ప్రకారం కథ‌నాలు..
ఆరోజూ దుర్మార్గ‌మైన రాజకీయమే. ఇవాళ కూడా అదే. అప్పుడు రెండు కుటుంబాలు ఒకటే కాబట్టి, టార్గెట్ వైయ‌స్ వివేకానందరెడ్డి. ఇవాళ కాస్త దూరం అయ్యాయి కాబట్టి, వివేకానందరెడ్డి కూతురు, అల్లుడిని ఎత్తుకుంటున్నారు. చంద్రబాబు వ్యూహం ప్రకారం కథ‌నాలు రాస్తున్నారు. ఆనాడు వివేకానందరెడ్డి క్యారెక్టర్‌ అస్సాసినేషన్‌ చేసిందెవ్వరు? ఇవాళ్టికీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వివేకానందరెడ్డిని గౌరవిస్తోంది అవినాష్‌రెడ్డి, అలాగే వైయస్సార్‌సీపీ. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆ హత్యకు సంబంధించి దస్తగిరి చెప్పిన మాటలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఆస్తులకు సంబంధించి రావాల్సినవి రాకపోతే కక్షతో పోయామని, హత్యలో ఎవరెవరు పాల్గొన్నదీ చెప్పారు. అయితే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను ఓడించారని, దానిపై వివేకానందరెడ్డి కోపంగా ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి చెప్పారని మాత్రం కొంత వేరే సీఆర్పీసీ–161లో రాశారు. అలాగే అందులో అవినాష్‌రెడ్డి పేరూ చేర్చారు. అయితే ఇంత జరిగినా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వాంగ్మూలాలు సీఆర్పీసీ–161 కింద తీసుకోరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే వారిని అప్రూవర్‌గా మార్చడం చాలా అరుదని న్యాయ నిపుణులు అంటున్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేక
కేసు ఇంత క్లియర్‌గా ఉన్నా, వైయ‌స్‌ జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక, కేసును ఆయనవైపు మళ్లిస్తూ, వైయ‌స్ వివేకానందరెడ్డి కూతురు, అల్లుడిని త‌మవైపు తిప్పుకుని హత్య కేసును ఆయనకు ఆపాదిస్తున్నారని అర్ధం అవుతోంది. నిజానికి వారికి ఆ హత్య జరిగినప్పటి నుంచే ఆ సంబంధాలు కొనసాగుతున్నాయా? అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దొరికిన లేఖను సాయంత్రం వరకు ఎందుకు బయటపెట్టలేదు. ఆ విషయం శివప్రసాద్‌రెడ్డి అప్పటి ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డికి చెప్పకపోవడం తప్పు కాదా?

నిష్పాక్షిక దర్యాప్తు కోరుకున్నారు:
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌కు తమ కుటుంబ సభ్యులపై గౌరవం ఉంది కాబట్టే, ఇప్పటి వరకు ఆయన మాట్లాడలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా జరగాలని ఆయన కోరుకున్నారు. కానీ నిందితులను కాపాడాలని సీఎం వైయ‌స్ జగన్ ప్రయత్నిస్తున్నారని ఆ మీడియా రాస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ కేసును ప్రభావితం చేయొద్దని, న్యాయబద్ధంగా జరగాలని వైయ‌స్‌ జగన్ కోరుకున్నారు. అందుకే ఎక్కడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదు. నిజానికి అప్పటి కాల్‌ రికార్డులు చూస్తే అన్నీ బయటపడతాయి. దస్తగిరికి లాయర్‌ను ఎవరు నియమించారన్నదీ తెలుస్తుంది. సీఎం వైయ‌స్ జగన్  ఆ నైతికతకు కట్టుబడ్డారు కాబట్టే, ఇవాళ సీబీఐ ఆ విధంగా వ్యవహరిస్తోంది. నిజానికి ఈ కేసును పోలీసులు కూడా చేధించే వారు. కానీ సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ కేసును దర్యాప్తు చేస్తే బాగుంటుందని భావించారు. అందుకే ఏనాడూ ఆ దర్యాప్తులో జోక్యం చేసుకోలేదు. 

కానీ.. ఆరోపణలు తగవు..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వైయ‌స్‌ వివేకానందరెడ్డి కుమార్తె అని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె కావాలంటే ఆ పార్టీలోకి వెళ్లొచ్చు. కానీ దాని కోసం ఇలా కుట్రలు చేయడం, ఆరోపణలు చేయడం సరికాదు. సీఎం వైయ‌స్ జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేనని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు, కచ్చితంగా ఇలాంటి మార్గాలే వెతుక్కుంటారు. ఇందులో మాకెలాంటి సందేహం లేదు. వివేకానందరెడ్డి హత్య వెనక వైయ‌స్‌ జగన్ ఉన్నారని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సీఎం  సీబీఐ దర్యాప్తులో ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఎవరినీ ప్రభావితం చేయలేదు. అదే చంద్రబాబు గతంలో రాష్ట్రంలోకి సీబీఐని రానివ్వనని అన్నారు. ఇవాళ అదే సీబీఐని ఎత్తుకుని, వైయ‌స్‌ జగన్ వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేయాలని చూస్తున్నారు.

వివేకా ఆత్మ క్షోభిస్తుంది..
ఒక మ్యానుఫ్యాక్చర్, మానిప్యులేటెడ్, సీఆర్పీసీ–161 స్టేట్‌మెంట్లు తీసుకువచ్చి జనం మీద వేస్తున్నారు. కాబట్టి విశ్వసించవద్దని ప్రజలను కోరుతున్నాం. నిజానికి వైయ‌స్ వివేకానందరెడ్డి ఆత్మ క్షోభిస్తుందని మేము బాధ పడుతున్నాం. ఆయనను ఏనాడూ వైయ‌స్ జగన్ అడ్డుకోలేదు. అందుకే ఎమ్మెల్సీగా నిలబెట్టారు. ఆనాడు వైయస్సార్ సీపీకి మెజారిటీ ఉన్నా, టీడీపీ కుట్ర చేసి ఓడించింది. కానీ అవన్నీ మర్చిపోయిన సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి ఇవాళ మాట్లాడుతున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజలెవ్వరూ విశ్వసించవద్దని మనవి.

Back to Top